calender_icon.png 9 October, 2024 | 6:53 AM

కాంగ్రెస్‌ను హర్యానా ఓటర్లు నమ్మలె

09-10-2024 02:29:54 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను అక్కడి ఓటర్లు విశ్వసించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ, కర్ణాటక మాదిరిగా హర్యానా ప్రజలను కాంగ్రెస్ మోసం చేయలేకపోయిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

తెలంగాణలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి తర్వాత ప్రజలను మోసం చేశారని వాటిని దేశమంతా గమనిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన ఆట ఆగిపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ప్రతిష్ఠను కాపాడుకునాలని హితవు పలికారు.

హర్యానా విజయంతో ప్రధాని మోదీకి ప్రజలపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. సీఎం నయాబ్ సైనీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలి, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ విజయం సాధ్యమైందని బండి పేర్కొన్నారు.