విహెచ్పిఎస్ జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ
మందమర్రి (విజయక్రాంతి): ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు ఓటరు అని ప్రతి ఒక్క పట్టబద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల శ్రీ వెంకటేశ్వర ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ వద్ద పట్టబద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. ఉన్నత విద్యావంతులు సామాజిక దృక్పథం కలిగిన వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 150 మంది ఉన్నత విద్యావంతులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొత్కు సుదర్శన్, పాత వీరస్వామి, రామటెంకి దుర్గరాజు, కుమారస్వామి, ముల్కల రాజేంద్రప్రసాద్, సాదుల విద్యాసాగర్, ఎండి ఆఫీస్, తోట గౌరయ్య, గాజుల శంకరయ్య, చంద్రకాంత్, బైరాజు శ్రీనివాస్, లక్ష్మణ్, దేవి నరసయ్య, నతారి రాజేందర్, రాగుల సతీష్, ఎండి ముజాహిద్, పాల్గొన్నారు.