calender_icon.png 26 October, 2024 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన

26-10-2024 12:23:59 PM

మధిర కోర్టు నిర్మాణానికి భూమి పూజకు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

ఖమ్మం (విజయక్రాంతి): హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీ సుధ, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ భీమపాక నగేష్, ఖమ్మం జిల్లా జడ్జ్ రాజగోపాల్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం, మధిర, సిరిపురంలలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మధిర సబ్ కోర్ట్ (సీనియర్ సివిల్ జడ్జి కోర్టు) ప్రారంభోత్సవంతో పాటు రెండు కోర్టుల భవన సముదాయ నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.