నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ పోషిస్తున్న తాజా చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ఈ సినిమాకు అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించగా, బాపినీడు బీ, సుధీర్ ఈదర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 14 నుంచి ఓటీటీ ప్లాట్ఫాం ఈటీవీ విన్లో స్ట్రీమ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం టీజర్ విడుదల చేశారు. పవిత్ర లోకేశ్ టీజర్ను లాంచ్ చేయగా డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. “నా బండికి నాలుగు చక్రాలు.. విజయనిర్మల గారు, కృష్ణ గారు, జంధ్యాల గారు, రామోజీరావు గారు. ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీమ్కు రామో జీ వెన్నుముక” అన్నారు. అతిథులు, ఆహూతుల ప్రసంగాల కన్నా ముందు వేదికపై ట్రైలర్ను ప్రదర్శించారు. వీరాంజనేయులు అస్తికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది.