హాజరైన మంత్రులు సీతక్క, పొన్నం
కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య పోషణ దినోత్సవం సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం జరిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకటి కరుణ , డైరెక్టర్ క్రాంతి వెస్లి , మహిళా సహకార అభివృద్ది సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి ,కలెక్టర్ ప్రమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ముసన్సిపల్ కమిషనర్ ఛాహత్ భాజ్ పెయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోషణ ఆరోగ్య జాతర సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్ లను మంత్రులు సందర్శించారు. స్టాల్ లలో పిల్లల పోషణ కు సంబంధించిన ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరం పరిశీలించారు.