29-03-2025 06:42:09 PM
కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వజ్జె రవి..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని గ్రామశాఖ అధ్యక్షులు వజ్జె రవి అన్నారు. శనివారం మండల పరిధిలోని వేల్పుచర్ల గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో రూ.ఐదు లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిక్కుల శేఖర్, గైగుళ్ల వీరయ్య, ఖమ్మంపాటి జాని, గైగుళ్ల యాదయ్య, శ్రీను, అక్కెనపల్లి రమేష్, కే వాసు తదితరులు పాల్గొన్నారు.