నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని విజయ క్రాంతి ఎండి సిఎల్ రాజం సతీమణి విజయ రాజ్యం ఆదివారం దర్శించుకున్నారు. సరస్వతి దేవికి కుంకుమార్చన, మహాహారతితోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు సిబ్బంది ఆమెకు ఆశీర్వాదాలు అందజేసి తీర్థ ప్రసాదలను అందజేశారు.