వాకథాన్ నిర్వహించిన ఐడీబీఐ ఉద్యోగులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే అప్రమత్తత వారోత్సవాలను( విజిలెన్స్ అవేర్నెస్ వీక్) పురస్కరించుకొని చాపెల్ రోడ్డులోని ఐడీబీఐ జోనల్ ఆఫీస్ ఉద్యోగులు బుధవారం ఎల్బీ స్టేడియం రోడ్డులో వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడీబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ శరత్కుమార్ కామత్ మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ చేయి కలపాలని, ఆన్లైన్ మోసాలతో సహా అనేక మోసాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.