కామారెడ్డి, అక్టోబర్17 (విజయక్రాంతి): అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నారనే ఆరోపణలపై గురువారం ఆర్టీసి విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు కామారెడ్డి ఆర్టీసీ డీఎం, అసిస్టెంట్ డీఎంల తీరుపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇటీవల కామారెడ్డి జేఏసీ కన్వీనర్, న్యాయవాది జగన్నాథం, కోకన్వీనర్లు సిద్దిరా ములు, నర్సింహారెడ్డి.. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, రవాణా శాఖ మంత్రి, టీజీఎస్ఆర్టీసీ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ విషయం బహిర్గతం కాకుండా ఆర్టీసీ డీఎం, అసిస్టెంట్ డీఎంలు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అయితే విచారణకు వచ్చిన విజిలెన్స్ అధికారులను వా రు మేనేజ్ చేశారా లేక చర్యలు తీసుకుంటారా వేచి చూడాల్సిందే.