17 June, 2026 | 4:32 PM

Breaking News

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు   •   అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం   •   తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన   •   కలెక్టర్.. టీచర్ అయ్యారు   •   ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత   •   అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేత   •   శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు   •   మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి   •   జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు   •  

సెమీస్‌లో విదర్భ, హర్యానా

13-01-2025 12:05 AM

విజయ్ హజారే ట్రోఫీ

వడోదర: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ, హర్యానా జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం గుజరాత్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో హర్యానా 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54) అర్థసెంచరీతో రాణించాడు. హర్యానా బౌలర్లలో అనూజ్, నిషాంత్ సింధు చెరో 3 వికెట్లు పడగొట్టారు.

అనంతరం హర్యానా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ హిమాన్షు (66) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయి 4 వికెట్లతో మెరిశాడు. ఇక రెండో క్వార్టర్స్‌లో విదర్భ జట్టు 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత రాజస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం విదర్భ 43.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేధించింది.

ధ్రువ్ షోరే (118 నాటౌట్), కెప్టెన్ కరుణ్ నాయర్ (122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగారు. కాగా కరుణ్ నాయర్‌కు టోర్నీలో ఐదోది కాగా వరుసగా నాలుగో శతకం సాధించాడు. తద్వారా నారయన్ జగదీశన్ (2021 తర్వాత ఐదు సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.