calender_icon.png 10 October, 2024 | 5:30 PM

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న గడ్డి అన్నరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్

10-10-2024 03:54:25 PM

అబ్దుల్లాపూర్‌మెట్: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి. గురువారం పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తారామతి పేట్ గ్రామంలో కొలువైన శ్రీ మహంకాళి అమ్మవారిని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరచారి దర్శించుకుని ప్రతేక పూజలు నిర్వహించరు. అనంతరం ఆలయ అర్చకులు వారిని శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా భాస్కరాచారి మాట్లాడుతూ.. మహంకాళి అమ్మవారిని నవరాత్రిల సమయం మహా దుర్గ అవుతారంలో దర్శనం చేసుకోవడం నా అదృష్టం భావిస్తున్నాని అన్నారు.  ఆలయ అభివృద్దికి నా సహాయం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చేగురి వెంకటేష్, అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్, అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మూల ప్రవీణ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.