calender_icon.png 23 October, 2024 | 3:37 PM

నారాయణఖేడ్ లో వి.హెచ్.పి ఆధ్వర్యంలో బంద్

23-10-2024 01:10:35 PM

నారాయణఖేడ్, (విజయక్రాంతి): హైదరాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయం విగ్రహ ధ్వంసం చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల ధ్వంసం చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, ఆర్టీసీ బస్సులు బంద్ పాటించాయి. బంద్ సందర్భంగా నారాయణఖేడ్ డి.ఎస్.పి, సిఐ, ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.