calender_icon.png 24 September, 2024 | 4:53 PM

లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వి.హనుమంతరావు దీక్ష

24-09-2024 02:23:38 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): లిబర్టీ తిరుమల తిరుపతి దేవస్థానం అయిన వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు మంగళవారం  దీక్ష చేశారు. టీటీడీలో పవిత్రమైన లడ్డు తయారీలో కల్తీ నెయ్యి జరిగిందన్న ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకున్నారు.