03-03-2025 07:00:47 PM
పాలు ఎక్కువ ఉత్పత్తి చేసిన రైతులకు బహుమతులు...
పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో సోమవారం నిర్వహించిన పశు వైద్య శిబిరం, ఎక్కువగా పాల ఉత్పత్తి చేసిన రైతులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశువులకు వైద్య సేవలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. మండల పశు వైద్యాధికారి సంతోష్ ఈ సందర్భంగా పశువులకు వైద్యం చేసి, రైతులకు అవసరమైన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ పాలు ఇచ్చే గేదెల యజమానులకు ప్రత్యేక బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ తిరుపతి, గోపాలమిత్ర, సంగమేశ్వర్, రైతులు పాల్గొన్నారు.