కడ్తాల్, ఫిబ్రవరి 2 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఆలయ ధర్మకర్త వింజమూరి రామాను జాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.