calender_icon.png 29 March, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ క్లబ్ అభివృద్ధిలో వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

25-03-2025 12:27:21 AM

కోదాడ, మార్చి 24:  కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు ముండ్రా వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు అని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణం నయానగర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన ముండ్ర వెంకటే శ్వరరావు మృతదేహానికి పబ్లిక్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాభి రెడ్డి, బొల్లు రాంబాబు లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు అని కోదాడ పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి ఆయన శక్తి వంచనా లేకుండా కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాభి రెడ్డి,బొల్లు రాంబాబు, ఎలగందుల నరసయ్య, ఉపాధ్యక్షులు వేనేపల్లి సత్యనారాయణ, మేకల వెంకట్రావు,  చింతలపాటి చంద్రశేఖర్, ఆవుల రామారావు, రామినేని శ్రీనివాసరావు,  సుంకారి సత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు..