calender_icon.png 28 October, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై వెంకయ్యనాయుడు హర్షం

07-07-2024 06:23:37 PM

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా కొనసాగుతున్న విభజన సమస్యల పరిష్కారంపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ కావడం మంచి ముందడుగని ఆయన అన్నారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగి పలు అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ వేదికగా వెల్లడించారు.