27-03-2025 01:10:54 AM
వేములవాడ, మార్చి 26: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి 20 రోజుల హుండీలను బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కించారు. స్వామివారికి 20 రోజులగా భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా ౧,95,75,168 రూపాయల నగదు సమకూరినట్లు తెలిపారు. బంగారం 287 గ్రాములు, వెండి 18 కిలోల 500 గ్రాములు భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.