12-03-2025 11:23:32 PM
భద్రాద్రి,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న ఈ ప్రఖ్యాత సంస్థ నూతనంగా కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్గా వెల్లంకి వెంకటేశ్వరరావు గారిని నియమించడం గర్వకారణం. వెల్లంకి కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో న్యాయ విద్య అభ్యసించారు. 1992లో కొత్తగూడెం బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా నమోదు అయ్యారు. న్యాయ రంగంలో ఆయనకు విస్తృత అనుభవం ఉండటంతో, సింగరేణి సంస్థకు తన అనుభవం ఎంతో ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా,సింగరేణి సీ&ఎండి డాక్టర్ బలరాం నాయక్కు మరియు సింగరేణి సమస్థ డైరెక్టర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నియామకం నాపై ఎంతో బాధ్యతను పెంచిందని, వెల్లంకి. తెలియచేసారు. తన నియామకాన్ని హర్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు,న్యాయవాదులు, మిత్రులు, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.