calender_icon.png 14 October, 2024 | 5:52 AM

హైవేలపై వాహనాల రద్దీ

14-10-2024 01:16:51 AM

 హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి)/కొండపాక : దసరాను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లిన 

ప్రజలంతా ఆదివారం తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌కు నలువైపులా ఉన్న జాతీయ రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హైదరాబాద్  విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద, వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై గూడూరు టోల్‌ప్లాజా వద్ద, సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్‌ప్లాజా వద్ద వందల సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ ఫీజు చెల్లించేందుకు వాహనాలు ఆగాల్సి రావడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిపోయాయి. అయితే, దుద్దెడ టోల్‌ప్లాజా వద్ద దాదాపు 5 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో టోల్‌ఫీజు వసూలు చేయకుండానే సంబంధిత సిబ్బంది వాహనాలను వదిలేశారు.