calender_icon.png 8 October, 2024 | 5:07 AM

వాహనం బోల్తా.. ఇద్దరి మృతి

08-10-2024 12:00:00 AM

అలంపూర్, అక్టోబర్ 7: పత్తి లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా కొంతలపాడు గ్రామ శివారులో సోమవారం జరిగింది. గద్వాల జిల్లా శాంతినగర్‌కు చెంది న మంగళి వెంకట్రాముడు, పూల స్వామి పత్తి వ్యాపారం చేస్తున్నారు. వడ్డెపల్లి మండలం తిమ్మాజిపల్లికి చెందిన ఏడుగురు కూలీలను మాట్లాడుకుని ఓ వాహనాన్ని కిరాయికి తీసుకుని కర్నూల్‌కు పంపించారు.

అక్కడ పత్తి కొని వాహనంలో లోడ్ చేసుకుని తిరుగు పయణ మయ్యారు. ఈ క్రమంలో కొంతలపాడు వద్ద వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న చేనులో బోల్తా పడింది. వాహనం పైన కూర్చున్న కూలీలు జ్ఞానవంతు(25), జమ్మన్న(39) అక్కడక్కడే మృతి చెందగా మిగితా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.