జుక్కల్ ఫిబ్రవరి 2 (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చిన్న ఏడిగి క్రాసింగ్ వద్ద ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిం చాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపడానికి, వాహనాల పత్రాలు దగ్గర ఉంచుకోవాలని వాహన దారులకు సూచించారు. పాత ఫైన్లు ఉంటే మీ సేవలో కట్టుకోవాలి అన్నారు. సిబ్బంది యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.