calender_icon.png 24 September, 2024 | 2:52 AM

పోరాటానికి వీరమల్లు రెడీ

21-09-2024 12:40:00 AM

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. మొదట ‘హరి హర వీర మల్లు’ మొదటి భాగం మిగతా షూటింగ్‌ను పూర్తి చేయడానికి సమయం కేటాయించనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి విజయవాడలో ఈ పార్ట్-1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’కు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నా మని నిర్మాతలు తెలిపారు. ఈ సన్నివేశాలను 400 మంది సిబ్బందితోపాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు.

సీనియర్ నటుడు నాజర్, రఘుబాబు తోపాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటివారు ఈ షూటింగ్‌లో భాగం కానున్నారు. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యువ దర్శకుడు జ్యోతికృష్ణ.. చిత్రీకరణ, నూతన తారాగణం, సాంకేతిక సిబ్బంది చేరిక వంటి వివరాలను ఎప్పటికపపుడు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్‌ను రంగంలోకి దింపారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వ హిస్తుండగా, ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏదయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.