calender_icon.png 21 February, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవస్థలపై నమ్మకం లేకే రామరాజ్యం ఏర్పాటు

20-02-2025 01:02:13 PM

వాగ్వాదమే రంగరాజన్ పై దాడి కారణం..

అందుకు చింతిస్తున్నట్లు వెల్లడి

వీర రాఘవరెడ్డికి ఈ రోజుతో ముగియనున్న పోలీస్ కస్టడీ  

చేవెళ్ల: వ్యవస్థలపై నమ్మకం లేకే రామరాజ్యం ఏర్పాటు చేసినట్లు చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్(Chilkur Balaji temple priest)పై దాడి చేసి వీర రాఘవరెడ్డి వెల్లడించారు. కోర్టు అనుమతి తో మూడురోజుల కస్టడీ కి తీసుకున్న మొయినాబాద్ పోలీసులు రంగరాజన్పై దాడికి గల కారణాలు, రామరాజ్యం లక్ష్యం, ఇప్పటి వరకు అతను వెళ్లిన ఆలయాలు... తదితర అంశాలపై వివరాలు సేకరించారు. 2014-15 విద్యా సంవత్సరంలో తన బిడ్డ రెండో తరగతి చదువుతున్నప్పుడు పాఠశాల యాజమాన్యం పైతరగతులకు ప్రమోట్ చేయకుండా డీటెయిన్ చేసిందని, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాడు చేసినా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. హైకోర్టుకు వెళ్లినా న్యాయం జరగలేదని వాపోయాడు.

అంతేకాదు 14 ఏండ్లలోపు పిల్లలను డిటెయిన్ చేయొద్దని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశానని చెప్పాడు.. అక్కడా న్యాయం జగకపోవడంతో దేశంలోని వ్యవస్థలపై సమ్మకం పోయిందన్నారు. అందుకే ఒక సాధువు చెప్పడంతో వ్యవస్థలను ప్రశ్నించేందుకు రామరాజ్యం సంస్థ ఏర్పాటు చేశానని వెల్లడించారు. ఇందులో సభ్యులను నియమించుకొని ఆలయాల వద్దకు వెల్లి అర్చకులు మద్దతు కోరుతున్నానని, ఇందులో భాగంగానే రంగరాజన్ వద్దకు వెళ్లానన్నారు. అయితే ఆయన అందుకు అంగీకరించలేదని.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తన సైన్యం ముందు చులకన అవుతానని అతనిపై దాడి చేసినట్లు చెప్పాడు . ఇందుకు తాను చింతిస్తున్నానని, భవిష్యత్లో శాంతియుతంగానే రామరాజ్యాన్ని నడిపిస్తానని వెల్లడించాడు.  

చదివింది పదో తరగతి వరకే

తాను పదో తరగతి వరకే చదివానని పోలీసులకు తెలిపాడు. మత గ్రంథాతో పాటు కొన్ని చట్టాలపై అవగాహన పెంచుకున్నానని, హిందూ ధర్మాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు వివరించాడు. నేటితో పోలీసుల కస్టడీ ముగియనుంది.