calender_icon.png 5 February, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన విసి

05-02-2025 05:41:20 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూర్ దక్షిణ ప్రాంగణంలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షల కేంద్రాన్ని బుధవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి బుధవారం తనిఖీ చేశారు. అనంతరం సౌత్​ క్యాంపస్​ గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ప్రాంగణం తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, మోహన్ బాబు, లలిత, హరిత, నాగరాజు, అంజయ్య, హాస్టల్ వార్డెన్లు యాలాద్రి, సునీత, ఏపీఆర్వో సరిత, సబిత, రమాదేవి, నారాయణ, శ్రీమాత, నిరంజన్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.