హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులుగా తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది. పలు శాఖల స్థాయీ సంఘాలకు సభ్యులను నియమిస్తూ ప్రకటనను జారీ చేసింది.
ఎంపీ రవిచంద్ర రాజ్యసభకు మొదటిసారి ఎన్నికైనప్పుడు కూడా ఇదే సంఘం సభ్యులుగా నియమితులయ్యారు. వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా నియమించిన విషయం తెలిసిందే.