ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): వసంత పంచమి వేడుకలు ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో ప్రారంభించారు. ఎల్లారెడ్డి పట్టణంతోపాటు మండలంలోని గండి మాసాన్నపేటలో ఎల్లమ్మ గుడి వార్షికోత్సవాన్ని నిర్వహిం చారు. అనంతరం వసంత పంచమి వేడు కలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఉషా గౌడ్ మండల గౌడ సంఘం అధ్యక్షులు సాయ గౌడ్ వెంకటేశం శ్రీనివాస్ గౌడ్ శంకర్ గౌడ్ తదితరులు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.