calender_icon.png 2 April, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు వాన్‌గార్డ్

01-04-2025 01:20:40 AM

  1. ఏఐ, డేటా అనాలసిస్, మొబైల్ టెక్నాలజీ సెంటర్
  2. ఈ ఏడాది చివరినాటికి ప్రారంభం
  3. నాలుగేండ్లలో 2,300 ఉద్యోగ అవకాశాలు
  4. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాన్‌గార్డ్ బృందం భేటీ 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠా త్మక సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్ కంపెనీ హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెం టర్ (జీసీసీ)ను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. మన దేశంలో వాన్‌గార్డ్ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావటం విశే షం. వాన్‌గార్డ్ ప్రతినిధి బృందం సోమవా రం బంజారాహిల్స్‌లోని సీఎం నివాసం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయింది.

వాన్‌గార్డ్ సీఈఓ సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఐఓ, ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ వాన్‌గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వాన్‌గార్డ్  జీసీసీ ఏర్పాటుకు ముం దుకు రావటం ఆనందంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి జీసీసీ గ మ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పా రు. వాన్‌గార్డ్ రాకతో ప్రపంచస్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని అన్నారు. మన దేశంలోని ప్రతిభను ఉపయోగించుకోవడానికి, సాంకేతిక నిపుణుల కు ఉద్యోగ అవకాశాలను మెరుగయ్యేందుకు దోహదపడుతుందన్నారు. ప్రభు త్వం తరఫున తగినంత సహకారం అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.

ఈ భేటీ అనంతరం హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు నిర్ణయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో తమ జీసీసీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్న ట్లు తెలిపింది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో 2,300 మంది ఉద్యోగులను నియ మించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది.

వాన్‌గార్డ్ ప్రపంచంలో పేరొందిన పెట్టుబడి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా పెట్టుబడిదా రులకు తమ సేవలు అందిస్తున్నది. హైదరాబాద్‌లో  వాన్‌గార్డ్ ఏర్పాటు చేసే కేం ద్రం ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేయనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజినీరింగ్ వంటి అధు నాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలని తలపెడుతున్నది. కంపెనీ సీఈవో సలీం రాంజీ మాట్లాడు తూ.. హైదరాబాద్‌లో వైవిధ్యమైన ప్రతిభతో పాటు, జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణముందని అభిప్రాయపడ్డారు. హైదరాబా ద్ తమకు అనువైన చోటుగా ఎంచుకున్నామన్నారు.