calender_icon.png 25 October, 2024 | 9:45 AM

వేంపేట్ వాసి గల్ఫ్‌లో మృతి

25-10-2024 01:21:35 AM

కరీంనగర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని వేంపేట్ గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్ (35) బెహరాన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకు దెరువు కోసం రెండున్నరేళ్ల కింద అప్పులు చేసి బెహారాన్‌కు వెళ్లాడు. కాగా,  అప్పుల బాధ ఎక్కువై అక్కడే తన గదిలో రాత్రి ఉరేసుకుని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుధీర్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్‌రెడ్డి సుధీర్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించడానికి కృషి చేస్తామని చెప్పారు.