07-03-2025 01:33:25 AM
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, మార్చి -6 ( విజయక్రాంతి ): ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముదిగొండ పట్టణ పరిధిలో ముదిగొండ నుంచి వల్లభి వరకు 5 కిలో మీటర్ల మేరకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని 28 కోట్ల రూపాయల ప్లాన్ నిధుల అంచనా వ్యయంతో నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిధులతో రహదారి విస్తరణతో పాటు డ్రైనేజి, ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాలు శాఖ ఎస్ఇ హేమలత, ఇఇ యుగంధర్ రావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.