calender_icon.png 27 October, 2024 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడవాడలా తిరంగా ర్యాలీ

13-08-2024 03:00:46 AM

  1. పెద్దసంఖ్యలో పాల్గొన్న బీజేపీ, అనుబంధ సంఘాలు
  2. ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను  ఎగురవేయాలని నేతల పిలుపు

సిద్దిపేట/మెదక్/ చేవెళ్ల /యాదాద్రి భువనగిరి, ఆగస్టు 12(విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవం రోజున దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాంచంద్రారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రధాన కూడలిలోని అంబేద్కర్, పూలే విగ్రహాల వద్ద జాతీయ గీతాన్ని ఆలపించారు. బీజేపీ నేతలు వెంకట్ రెడ్డి, అనంత్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండ వీణ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులు సంగీత, మల్లికా, రాజ్యలక్ష్మి, ప్రవళిక, మంజుల తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా భువనగిరిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట ఓమినీ దవాఖానా నుంచి మన్సూరాబాద్‌లోని సహారా వరకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ బీజేపీ మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.