కరీంనగర్, (విజయక్రాంతి): దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టి తో తయారు చేసిన దీపాంతలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి ,ఆరోగ్యానికఎంతగానో ఉపయోగపడుతుందని.. కుల వృత్తులను రక్షించినట్టు ఉంటుందన్నారు. మట్టితో తయారు చేసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వలని, మట్టి చాయ్ కప్పులు అయినా ,మట్టి తో తయారు చేసిన వాటర్ బాటిల్స్ వాడుతూ.. కుమ్మర్లకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.