10-03-2025 05:26:15 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గుండి రోడ్డులో గల తపాలా శాఖ కార్యాలయంలోని ఆధార్ సెంటర్ ద్వారా వినియోగదారులు సేవలను వినియోగించుకోవాలని పోస్టుమాస్టర్ యోగేష్ కుమార్ తివారి తెలిపారు. ఈ ఆధార్ కేంద్రంలో ఆధార్ లో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, ఇతర సవరణలు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.