calender_icon.png 23 October, 2024 | 3:00 PM

ఎంబీబీఎస్ విద్యార్థి చదువుకి బాసటగా ఉప్పల్ ఎమ్మెల్యే

23-10-2024 12:31:25 PM

ఎంబీబీఎస్ విద్యార్థి ఇంటికి వెళ్లి చెక్కును అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి

కాప్రా (విజయక్రాంతి): చర్లపల్లి డివిజన్ సాయివెంకట్ ఎంక్లేవ్ కి చెందిన బాణాల నవీన్ కుమార్ గారి కుమారుడు నిఖిల్ చారి ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి తన స్వంత నిధులతో బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ కి అయ్యే ఫీజు 29,000/- రూపాయల చెక్కు వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఎవరైనా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే ఫీజు మొత్తం తానే చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కనక రాజు, సార అనిల్, కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.