కాప్రా, (విజయక్రాంతి): కాప్రా సర్కిల్, డాక్టర్ ఏఎస్ రావు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా 20 లక్షల 72 వేల 500 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అన్నారు. చెక్కులను తొందరగా వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, సాయి జెన్ శేఖర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.