రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు
మ్యాచ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 12న జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
సీపీ మాట్లాడుతూ.. మ్యాచ్ ముగిసేవరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. స్టేడియం పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రేక్షకులకు పార్కింగ్ సదుపాయంతో పాటు సాధారణ వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
బ్లాక్లో టికెట్లు విక్రయించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు, వైస్ ప్రెసిడెంట్ దల్జీర్సింగ్, డీసీపీలు కరుణాకర్, అరవింద్బాబు, రమణారెడ్డి, ఉషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.