calender_icon.png 18 October, 2024 | 7:49 PM

ముమ్మరంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం..

18-10-2024 05:39:30 PM

గజ్వేల్, (విజయక్రాంతి): గజ్వేల్ మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి తరుపున గజ్వేల్ మండల పాఠశాలల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గజ్వేల్ శాఖ అధ్యక్షుడు వంటేరు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిగుళ్ల లింగంలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఓటు హక్కును నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పీఆర్టీయూ బలపర్చిన వంగ మహేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం గజ్వేల్ మోడల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బషీరుద్దీన్, జానకిరాంరెడ్డి, శివశంకర్, శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి, ఇనాగరాజు తదితరులు పాల్గొన్నారు.