calender_icon.png 21 October, 2024 | 10:53 AM

ఆగని పసిడి పరుగు

20-10-2024 12:00:00 AM

  1. హైదరాబాద్‌లో రూ.79,420 వద్ద సరికొత్త రికార్డు 
  2. 4 రోజుల్లో రూ.2,000 ప్రియం
  3. ప్రపంచ మార్కెట్లో 2,736 డాలర్ల ఆల్‌టైం గరిష్ఠస్థాయికి ఔన్సు ధర 

హైదరాబాద్, అక్టోబర్ 19: ధనతెరాస్, దీపావళి పండుగలకు బంగారం కొనాలనుకున్నవారికి నిరుత్సాహాన్ని కల్పిస్తూ ఏ రోజుకారోజు ధర ఎగిసిపోతున్నది.  ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలతో పాటు, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు, రానున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితి బం గారాన్ని పరుగులు తీయిస్తున్నాయి. 

తాజా గా అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయంగానూ సరికొత్త రికార్డు స్థాయికి పుత్తడి పెరిగింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర  చరిత్రలో తొలిసారిగా శుక్రవారం రాత్రి 29 డాలర్ల మేర పెరిగి 2,736 డాలర్ల వద్దకు చేరింది. దీనితో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం మరో రూ. 440 పెరిగి రూ.79,420 వద్దకు చేరింది.

వరుస నాలుగు రోజుల్లో తులం ధర రూ.2,000 ఎగిసింది.  ప్రపంచంలో ఇన్వెస్టర్ల డిమాండ్‌కు తోడు స్థానిక మార్కెట్లో రానున్న ధన తెరాస్, దీపావళి నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలు పుత్తడి జొరు కు కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు. తాజాగా ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం తులం ధర మరో  రూ.400 పెరిగి రూ.72,800 వద్దకు చేరుకున్నది.