27-04-2025 06:23:43 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన వచ్చింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod), బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్(Bellampalli ACP Ravikumar) తో కలిసి మెగా వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యం పరీక్షల కోసం పోలీసులు వైద్య సేవలు అందించడం ముదావహమన్నారు. గిరిజన పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం పట్ల ఆయన అభినందించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ... గిరిజనులకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించిన అందించిన ఘనత మాదారం పోలీసులు దక్కుతుందన్నారు.
ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి గిరిజనులకు సంక్షేమానికి పాటుపడాలన్నారు. ఈ వైద్య శిబిరంతో తాండూర్ మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల నర్సపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అసలమాడా, బీర్సయిగూడ, గంగుపటేల్ గూడా, బెజ్జల, భోగడ గూడా, లిoగుపటెల్ గూడ, గంపలపల్లి, గంటలగూడా, లాస్పటలగూడ, దొడ్డిగూడా, నర్సపూర్, అబ్భాపూర్, రాంగూడ, కడెంబెర్గుడా, రోడగూడ, పళ్లెవగూగూడ, ఎల్లయ్యగడ లలోని గూడెల ప్రజలు మెడిలైఫ్ హాస్పిటల్ సహకారంతో వైద్య సేవలు పొందారు. 500కు పైగా గిరిజనులకు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా పరీక్షలు చేసిమందులు ఇచ్చారు. ఈ కార్యక్రమoలో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్, తాండూర్ సీఐ కుమార స్వామి, మాదారం ఎస్సై సౌజన్య పాల్గొన్నారు.