calender_icon.png 18 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబిబిఎస్ లో యూనివర్సిటీ టాపర్

11-04-2025 08:45:01 PM

5 గోల్డ్ మెడల్స్ సాధించిన బెల్లంపల్లి విద్యార్థిని దుర్గం కావ్య...

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ కు చెందిన విద్యార్థిని దుర్గం కావ్య ఎంబీబీఎస్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు. దుర్గం కావ్య హైదరాబాదులోని గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె .ఇందిర చేతుల మీదుగా ఎంబిబిఎస్ పట్టాను అందుకున్నారు.

చదువులో మొదటి నుంచి రాణిస్తున్న కావ్య యూనివర్సిటీ టాపర్ గా నిలిచి 5 గోల్డ్ మెడల్స్ ను పొందారు. షంషీర్ నగర్ లో దుర్గం రామకృష్ణ, దుర్గం విజయ దంపతుల పెద్ద కుమార్తె అయిన దుర్గం కావ్య 2019 సంవత్సరంలో ఎంబిబిఎస్ లో చేరారు. నాలుగేళ్లలో 4100 మార్కులకు గాను 3063 మార్కులు సాధించారు. మొదటినుంచి చదువులో రాణిస్తూ యూనివర్సిటీ స్థాయిలో కావ్య టాపర్ గా నిలిచి 5 గోల్డ్ మెడల్స్ ను సాధించిన డాక్టర్ కావ్యను పలువురు అభినందిస్తున్నారు.