calender_icon.png 4 October, 2024 | 12:56 PM

నేడు రాష్ట్రంలో కేంద్రమంత్రి పర్యటన

05-09-2024 12:53:42 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతా ల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ రోజు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ బృందంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సైతం రాష్ట్రానికి రానున్నట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఈ బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది.