calender_icon.png 25 March, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వస్తాం

23-03-2025 12:36:57 PM

బీఆర్ఎస్ అధికారం కోసం తహతహలాడుతోంది

హైదరాబాద్: దేశంలో లేని సమస్యను సృష్టించి.. బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం తహతహలాడుతోందని కేంద్రమంత్రి విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాత బంధం బయటపడిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్(Delimitation) విధివిధానాలపై ఇంకా చర్చనే జరగలేదని ఆయన సూచించారు. డీలిమిటేషన్ పై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో కుటుంబ, కుంభకోణం పాలన జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని బీజేపీ(Bharatiya Janata Party) రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్నాటక, తెలంగాణలో అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తమిళనాడులో బీజేపీ మరింత బలపడుతోందన్నారు. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కేంద్రప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఇప్పటివరకు డీలిమిటేషన్ పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్సే అన్న కిషన్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదని హెచ్చించారు.

డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి, కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నిన్నటి చెన్నై సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మార్చేస్తారని తప్పుడు ప్రచారం చేశారు. డీలిమిటేషన్ పై కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి ఆలోచన చేయలేదని స్పష్టం చేశారు.