calender_icon.png 21 October, 2024 | 1:04 AM

వారంరోజులుగా హైదరాబాద్ అట్టడుకుతోంది: కిషన్ రెడ్డి

20-10-2024 05:40:16 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వారంరోజులుగా హైదరాబాద్ అట్టడుకుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు, గుడి ధ్వంసంతో నగరం అట్టుడుకుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతలేమో సచివాలయం గోడలు దాటట్లేదని, సీఎం హిందూ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. హిందూ పండగల్లో అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారు. సికింద్రాబాద్ లో పోలీసుల లాఠీఛార్జ్ కు రేవంత్ రెడ్డి ఆదేశించి, మరో వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ లాగే ప్రస్తుత కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. పరీక్షలు రాసే వారికి ఏ పుస్తకాలు ప్రామాణికమో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడిగారు.