calender_icon.png 26 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలిస్తోంది

12-07-2024 12:29:07 PM

రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలన

రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూట్ కేసులు పంపుతున్నారు 

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటి

హైదరాబాద్: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవలేక ప్రజా ఆగ్రహానికి గురైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆయన ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.. ఎనిమిది నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై విద్యార్థులు, మహిళలు పోరాటాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతోందన్నారు. రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలిస్తోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూట్ కేసులు పంపుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటి అని కిషన్ రెడ్డి తెలిపారు.