హైదరాబాద్: అశోక్ నగర్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్సి) గ్రూప్ 1 పరీక్షపై నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో, కేంద్ర రాష్ట్ర మంత్రి, బిజెపి నాయకుడు బండి సంజయ్ కుమార్ శనివారం నాడు నిరసన స్థలాన్ని సందర్శించి ఆశావాదులతో సమావేశమయ్యారు. అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లిన కేంద్రమంత్రిని గ్రూప్ -1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. అశోక్ నగర్ కు బండి సంజయ్ రాకతో గ్రూప్ వన్ అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. అటు అశోక్నగర్లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు.