calender_icon.png 23 October, 2024 | 12:59 PM

వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతాం: బండిసంజయ్

11-07-2024 02:17:56 PM

తిరుమల: పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టేందుకు, వికసిత భారత్ లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేవదేవుడు మరింత శక్తిని అందించాలని ప్రార్థించడం జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు. స్వామివారిని అడ్డుబెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయింది, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సేవకుల పాలన వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.