calender_icon.png 18 October, 2024 | 8:52 PM

న్యాయం కోరితే రక్తం కళ్ల జూస్తారా..?: బండి సంజయ్

18-10-2024 06:20:45 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీ చేసి నిరుద్యోగుల భవిష్యత్ ను బీఆర్ఎస్ పార్టీ నాశం చేసిందని బండి సంజమ్ ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని ప్రస్తుతం నిరుద్యోగులు భవిస్తున్నారు. నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం వినాలి.. జీవో 29ను రద్దు చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

గ్రూప్-1 అభ్యర్థుల కోసం ఎందాకైన పోరాడుతామని.. జీవో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టు లాంటిదాని ఆయన తెలిపారు. గ్రూప్-1 పరీక్షలకు రీషెడ్యూల్ చేసేదాకా ఉద్యమిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని తప్పుబట్టిన సంజయ్ న్యాయం కోరితే రక్తం కళ్ల జూస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ నగర్ వెళ్లి గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలకు మద్ధతిచ్చేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు.