calender_icon.png 27 October, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం లేదు: బండి సంజయ్

12-07-2024 05:43:37 PM

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలు గ్రహించిన తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం పోయిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తమ ఏకైక గ్యారంటీ‌... నరేంద్ర మోదీ గ్యారంటీ మీద మాత్రమే తమకు విశ్వాసం ఉందనే విషయాన్ని గుర్తించిన ప్రజలు శాసనసభ ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని గుర్తించి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. నరేంద్ర మోదీ స్పూర్తి... నరేంద్ర మోదీ గ్యారంటీ విషయంలో తెలంగాణ ప్రజలు విశ్వసించారు కాబట్టే ఎనిమిది సీట్లలో బీజేపీని గెలిపించారని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణకు అండ, దండగా ఉండేది భారతీయ జనతా పార్టీనే అని నమ్మి, సార్వత్రిక ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 8 స్థానాల్లో బిజెపిని గెలిపించిన తెలంగాణ ప్రజానీకానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గం సెల్యూట్ చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో గెలిపించడంతో పాటు 46 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యాన్ని ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు బిజెపి మీద, నరేంద్ర మోదీ మీద వ్యక్తిగత విమర్శలు చేసినా కానీ ప్రజలు వాటిని నమ్మలేదు. అలాంటి తెలంగాణకు అండగా ఉంటాం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు.