calender_icon.png 27 February, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిలో ఒక్కసీటూ తగ్గదు!

27-02-2025 12:49:00 AM

తమిళనాడు సీఎం స్టాలిన్ మాటల్లో నిజంలేదు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలకవ్యాఖ్యలు

చెన్నై, ఫిబ్రవరి 26: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 స్థానాలను కోల్పోతుందన్న ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ వాద నను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు. ఏ దక్షిణాది రాష్ట్రం తమ సీట్లను కోల్పోదని స్పష్టం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభలో స్పష్టం చేశారని గుర్తుచేశారు.