నిజామాబాద్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బడా బజార్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ అజయ్కుమార్ రిమాండ్ విధించారు. నిజామాబాద్ కోర్టు బ్యాంకు మేనేజర్ అజయ్ కు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. రూ. 3.4 కోట్లను సొంత ఖాతాల్లోకి మళ్లించారనే ఆరోపణలతో కేసు నమోదు అయింది. మేనేజర్ అజయ్ పై బ్యాంకు అధికారి గత నెల 19 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన బ్యాంకు మేనేజర్ అజయ్ ను ప్రత్యేక పోలీసులు బృందాలు పట్టుకున్నాయి.